వైయస్ జగన్ పోరాటం వల్లే

గుంటూరు

 : రాష్ట్రంలో రైతులకు కనీసం రూ. 10 వేల కోట్ల రుణమాఫీ అయినా జరిగిందంటే.. అది కేవలం  ప్రతిపక్ష నేత వైయస్ జగన్  చేసిన పోరాటం వల్లేనని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైయస్సార్ ఆశయ సాధన కోసం వైయస్సార్సీపీ పనిచేస్తుందని చెప్పారు.  గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ధర్మానతో పాటు వై. విశ్వేశ్వరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితర నేతలు పాల్గొని ప్రసంగించారు.

టీడీపీ అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో ప్రతి కుటుంబం వైయస్ పాలన కావాలని కోరుకుంటున్నారని ధర్మాన అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయడానికి బదులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ నిరాహార దీక్ష చేస్తే.. ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాబు ఇచ్చిన హామీలు నెరవర్చలేదని కారణంగా బాపట్ల తహసిల్దారుకు వైయస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.


Back to Top