దుష్టశక్తుల దుష్ర్పచారం

మైదుకూరు : ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుగా కొన్ని దుష్టశక్తులు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరులో పార్టీ నాయకుడు ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి వైయస్‌ఆర్‌ సీపీ తరఫున తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఓ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో చేరడమనేది తన స్వభావానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు.

Back to Top