కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టీడీపీ సీనియర్ నేత వైయస్ఆర్సీపీలో చేరిక
18 Nov 2017 1:37 PM
కర్నూలు: కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 11వ రోజు శనివారం వైయస్ జగన్ బనగానపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ అధినేత వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ రామి రెడ్డితో పాటు కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు నాయక్ కూడా వైయస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే జనార్ధన్రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అందుకే వైయస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎర్రబోతుల వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.