మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఈ బడ్జెట్ లోనైనా రైతులకు న్యాయం చేస్తారా..?
09 Mar 2016 11:10 AM
అసెంబ్లీః రైతులకు రుణాలు మాఫీ చేయకుండా ప్రభుత్వం బ్యాంకులను నిందిస్తూ తప్పించుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రుణాలు మాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశ్వశ్వరరెడ్డి మాట్లాడుతూ... ఈ బడ్జెట్లోనైనా రైతులకు న్యాయం చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇప్పటికీ రూ. 5వేల కోట్లకు పైగా రైతులకు రుణామాఫీ చేయాల్సి ఉందన్నారు. లక్షా 40 వేల కోట్లు నిధులిచ్చామని కేంద్రం చెబుతుంటే..చంద్రబాబు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వలేదని అంటున్నారని, ఇందులో ఏది నిజమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బంగారు రుణాలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా రుణామాఫీ కాకపోవడంతో.... రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.