వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఓట్ల తొలగింపు దారుణం
01 Oct 2016 6:02 PM
గుంటూరు(పట్నంబజారు)) కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడితే న్యాయపోరాటానికి ఏ మాత్రం వెనుకాడబోమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తుతూ...అధికారులు సైతం బలిపశువులు కావద్దని హెచ్చరించారు. అరండల్పేటలోని నగర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అడుగడుగున పారదర్శకతను పాతర వేస్తూ.. నిబంధనలకు నీళ్ళోదులుతూ అధికార పార్టీనేతలకు తలొగ్గి అడ్డుగోలుగా ఓట్లు తొలగించిన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ పరిధిలో లక్షకు పైబడి ఓట్లు తొలగించారని... ఏ ప్రాతిపదికన, ఏఏ వార్డుల్లో ఎన్ని ఓట్లు తొలగించారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అవుతున్నా నగరంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజలు వైయస్సార్ సీపీకి అనూకూలంగా ఉన్నారన్న ఉద్దేశ్యంతోనే తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఓట్లను అక్రమంగా తొలగించారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 5న పార్టీ నగర ముఖ్యనేతల విస్త్రృతస్ధాయి సమావేశం జరుగుతుందని, ప్రభుత్వం, అధికారుల తీరుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాల్పురం రాము), బందా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.