వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'డిసిసిబి ఎన్నిక నిర్వహించకపోతే ఆత్మాహుతి'
20 Feb 2013 12:51 PM
కడప, 20 ఫిబ్రవరి 2013: నోటిఫికేషన్ ప్రకారం కడప డిసిసిబి ఎన్నిక తక్షణమే జరిపించకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఆత్మాహుతికైనా వెనుకాడబోనని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ వివేకానందరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికల అధికారి లేరన్న సాకు చూపించి డిసిసిబి ఎన్నికను వాయిదా వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తోందని వివేకానందరెడ్డి ఆరోపించారు. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నిక నిర్వహించాలని ఆయన బుధవారం ఇక్కడ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా డిసిసిబి ఎన్నికల నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని వివేకానందరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఎన్నికల అధికారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేయించి, అధికారి లేరనే మిషతో ఎన్నికను వాయిదా వేయాలని ఆలోచన చేయడం చాలా దురదృష్టకరం అని వివేకానందరెడ్డి విమర్శించారు. నోటిఫికేషన్కు కనీస విలువ ఇవ్వాలంటే ఈ ఎన్నికలను తప్పనిసరిగా ఈ రోజే జరిపించాలన్నారు. డిసిసిబి ఎన్నిక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తామంతా నిరాహార దీక్ష చేస్తున్నామని వివేకానందరెడ్డి స్పష్ట చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి తాము బతుకు చాలించడానికి కూడా సిద్ధం అని హెచ్చరించారు.