ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై చర్చ

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రజాపద్దుల కమిటీ బుధవారం అనంతపురంలో సమావేశమైంది. చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై చర్చించారు. ఈసందర్భంగా 2012-2013 సంవత్సరానికి సంబంధించి కాగ్‌ రిపోర్ట్ గమనికలపై రివ్యూ చేసినట్లు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.

నీటి పారుదలలేని ప్రాంతాలకు చిన్ననీటి పారుదల ద్వారా నీరందించే మార్గాలపై చర్చింనట్లు బుగ్గన చెప్పారు.  ఈ సమావేశంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top