మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్పై ప్రజలకు పూర్తి విశ్వాసం
05 Jan 2018 3:13 PM
చిత్తూరు:వైయస్ జగన్పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా నాయకుడు ధర్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం జననేతకు విశాఖ జిల్లాకు చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ధర్మశ్రీ మాట్లాడుతూ..వైయస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వంంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. కరెంటు బిల్లులు విఫరీతంగా పెరిగాయని ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. చంద్రబాబు తీరుతో జనం విసుగు చెందారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేయడం, టీడీపీ కార్యకర్తలకు లబ్ధిచేకూర్చే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.
2019లో వైయస్ జగన్ సీఎం: భాగ్యలక్ష్మీ
2019లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మహిళా విభాగం నాయకురాలు భాగ్యలక్ష్మీ అన్నారు. మహిళల నుంచి, యువత నుంచి ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తుందని ఆమె తెలిపారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకొని మాట తప్పారన్నారు.