మేనేజ్‌మెంట్స్‌పై టీడీపీ నేతలకు హితబోధ

శ్రీకాకుళం: కేవలం మేనేజ్‌మెంట్స్‌ ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవగలమని, ప్రజలెవరూ తన పరిపాలనపై  అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పకనే చెప్పాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళగిరిలో మీటింగ్‌ పెట్టి చంద్రబాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోల్, పొలిటికల్, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్స్‌పై హితబోధ చేశాడన్నారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని ధర్మాన మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ధర్మాన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

తాజా వీడియోలు

Back to Top