ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
గరగపర్రు నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
28 Jun 2017 6:59 PM
పొన్నూరుః పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం, గరగపర్రు దళితులను గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వైయస్సార్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్ధాలు అవుతున్నప్పటికీ దళితులను గ్రామ బహిష్కరణ చేసేవిధంగా టిడిపి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఒకవైపు పూలమాలలు వేస్తూ మరోవైపు ఆయన విగ్రహాలను పెట్టనీయకుండా ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. దళిత దళారులను అడ్డుపెట్టుకొని దళితులకు చెందాల్సిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన పేర్కాన్నారు. రాష్ట్రంలో దళితులంతా ఏకమై రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారని సుబ్బయ్య హెచ్చరించారు.