మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
31 Aug 2017 6:55 PM
కడియం : డబ్బు, అధికారం, పోలీసు తదితర మార్గాల్లో ప్రజాస్వామ్యాన్ని అన్నివిధాలా టీడీపీ ఖూనీ చేసి నంద్యాలలో విజయం సాధించిందని వైయస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని టీడీపీ నాయకులు అక్కడి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. భౌతిక దాడులకు దిగి భయాందోళనలు కలిగించారన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇంతలా దిగజారిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. పరిపాలనను పక్కన పెట్టి నంద్యాల ఉపఎన్నికపైనే దృష్టిపెట్టడం ద్వారా తమ చేతగానితనాన్ని టీడీపీ ఒప్పుకున్నట్లైందని గిరజాల అన్నారు. కాగా.. సెప్టెంబర్ 2వ తేదీన దివంగత నేత వైయస్ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలో పార్టీ నాయకులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.