మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్యాకేజీ పేరుతో మోసం
25 Oct 2016 11:40 AM
కర్నూలుః ప్రతీ ఒక్కరి మొహంలో చిరునవ్వు చూడాలన్నదే వైయస్ జగన్ కోరికని, అయితే అది ప్రత్యేకహోదాతోనే సాధ్యమని న్యాయవాది శంకరయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను మ్యానిఫెస్టోలో పెట్టుకున్న టీడీపీ, బీజేపీలు ప్రజలను ప్రత్యేక నాటకంతో ప్యాకేజీ పేరుతో మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక హోదాతో లాభపడిన సంగతి ఆ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు భ్రమల్లో నుంచి బయటకు రావాలన్నారు. చట్టాల పేరు చెప్పి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవడం తగదని బాబుకు హితవు పలికారు.