మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జంతర్మంతర్ వద్ద నేడు విజయమ్మ ధర్నా
28 Aug 2013 10:20 AM
న్యూఢిల్లీ, 28 ఆగస్టు 2013:
రాష్ట్ర విభజన విషయంలో అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మతో పాటు పార్టీ ఎం.పి., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఉదయం పది గంటలకు ధర్నా ప్రారంభం కానుంది.
అనేక చిక్కు సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్రాన్ని విభజించడం సరికాదంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మంగళవారంనాడు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి, వినతిపత్రాలు అందజేశారు. సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన వారు... చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరారు.