మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
దళిత ఎమ్మెల్యేపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
05 Apr 2018 4:10 PM
కర్నూలు: ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న దళిత ఎమ్మెల్యే ఐజయ్యపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కర్నూలు జిల్లా పరిషత్సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య పలు సూచనలు చేశారు. దీంతో జీర్ణించుకోలేకపోయిన కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఈ తీరును ఎమ్మెల్యే ఐజయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైయస్ఆర్సీపీనే అంటూ జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు.