టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
ప్రజా సంకల్ప యాత్రకు ఐక్య దళిత మహానాడు మద్దతు
31 Jan 2018 3:42 PM
నెల్లూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఐక్య దళిత మహానాడు నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో జరుగుతున్న దాడులను వైయస్ జగన్కు వివరించారు. ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణకరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ఘటనలతో దళితులు అభద్రతా భావంలో ఉన్నారని, మీరు ముఖ్యమంత్రి అయి దళితులకు తోడుగా ఉండాలని కోరారు. ఐక్యత, అభివృద్ధి, రక్షణే ధ్యేయంగా ఏర్పడిన ఐక్య దళిత మహానాడు వైయస్ఆర్సీపీ వెంట ఉంటుందని వారు పేర్కొన్నారు. దళిత సంఘాల నాయకులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న వైయస్ జగన్ వారికిభరోసా కల్పించారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు చాలా బాగున్నాయని దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.