మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్సీపీ మహాధర్నాకు మద్దతు వెల్లువ
05 Mar 2018 1:17 PM
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాకు పలువురు ఇతర పార్టీల నేతలు, ప్రజాసంఘాల కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆప్ నేత రామారావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు సదాశివారెడ్డి, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులు సంసద్మార్గ్లో కొనసాగుతున్న మహాధర్నాలో పాల్గొని.. వైయస్ఆర్సీపీ పోరాటానికి అండగా నిలబడారు. ప్రత్యేక హోదా మన హక్కు అని, ప్రత్యేక హోదాను సాధించే పోరాటంలో అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. అందరూ కలిసి పోరాడితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని అన్నారు. ఏపీకి హోదా రాకపోవడానికి మొదట ద్రోహి కేంద్ర ప్రభుత్వం, రెండో ద్రోహి రాష్ట్ర ప్రభుత్వమని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. ఈ రెండు ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెప్పాలని మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్ ప్రజలకు సూచించారు.