రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైఎస్ జగన్ దీక్షకు కదిలిరండి..!
09 Sep 2015 7:56 PM
హైదరాబాద్: ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26నుంచి గుంటూరులో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ధర్మాన ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయని ధర్మాన మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై అధికారపార్టీ ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని...ప్యాకేజీ హోదాకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని ధర్నాన స్పష్టం చేశారు.