మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇసుక మాఫియాను అరికట్టండి
11 Feb 2015 3:55 PM
విజయవాడ: జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను కలెక్టర్ను కోరారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావుతో కలిసి మచిలీపట్నం వచ్చిన ఆయన కలెక్టర్ బాబును కలిశారు. ఆయనకు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడారు. వత్సవాయి మండలం ఆలూరుపాడు ఇసుక రీచ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియాతో కుమ్మకై రోజుకు రూ.5 లక్షల విలువైన ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కేటాయించిన ఇసుక రీచ్లలో మహిళలు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యాపారాలు చేస్తున్నారని ఆయన వివరించారు.