ధ‌ర‌ల నియంత్ర‌ణ ముఖ్యం: మేకపాటి

న్యూఢిల్లీ:  నిత్యావ‌స‌ర వస్తువుల ధ‌ర‌లు పెరిగిపోతున్నందున కేంద్రం చొర‌వ చూపాల‌ని, నియంత్ర‌ణ కోసం ఒక స‌మ‌గ్ర విధానాన్ని కేంద్రం అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. పార్ల‌మెంటులో  ధరల పెరుగుదలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ చెబుతున్నా దేశంలో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌లో 5.47 శాతం పెరిగిన ధరలు, మేలో 5.76 శాతానికి పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడి జీవితం క‌ష్ట‌త‌రంగా మారింద‌ని మేక‌పాటి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
"వడ్డీరేట్ల విధానంతోనే ధరలు నియంత్రించవచ్చని ఆర్బీఐ నమ్మడం బాధాకరం. పంట సాగు లేకపోవడం, సబ్సిడీల కొరత, బ్లాక్ మార్కెట్‌కు నిత్యావసరాలు తరలించడం వంటి అనేక కారణాల వల్ల ధరలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి నిర్ణయాత్మాక చర్యలు చేపట్టాలి" అని మేకపాటి కోరారు.
Back to Top