వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రామిరెడ్డి కుటుంబసభ్యులకు పరామర్శ
05 Mar 2016 12:34 PM
హైదరాబాద్ : మాజీ మంత్రి, పాలేరు
ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ఫోన్‑లో పరామర్శించారు. కుటుంబ
సభ్యులకు తమ సంతాపం తెలియ చేశారు. అటు, వెంకట రెడ్డి
మృతదేహాన్ని ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొంగులేటి
శ్రీనివాస్‑రెడ్డితోపాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి... ఘనంగా
నివాళులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పాత
లింగాలలో నిర్వహించనున్నారు.మాజీ మంత్రి, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్తో
బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కిమ్స్
ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం
రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించారు.