అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు తరలిరండి
31 Oct 2016 4:57 PM
విశాఖపట్నం(మునగపాక): రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం.... తమ నాయకుడు వైయస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రత్యేకహోదా సాధనకోసం ఈనెల 6న విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ... ఆంద్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ మొదటినుంచి పోరాటం చేస్తున్న పార్టీ వైయస్సార్సీపీయే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనన్నారు. సమావేశంలో మునగపాక, అరబుపాలెం సర్పంచ్లు టెక్కలి రమణబాబు, లంబా అప్పారావు, పార్టీ నాయకులు కాండ్రేగుల నూకరాజు, బొడ్డేడ శ్రీనివాసరావు, ఇల్లా నాగేశ్వరరావు, జోగినాయుడు, పల్లె అప్పలనాయుడు , బీలా అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.