మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అరకులోయను లూటీ చేసేందుకే బాబుతో కుమ్మక్కు
29 Apr 2016 3:50 PM
విశాఖపట్నం(అరకులోయ): వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కిడారి సర్వేశ్వర్ రావుపై మండిపడ్డారు. సర్వేశ్వరరావు రూ.10 నుంచి రూ.15 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. అరకులోయలోని ఆర్అండ్బీ అతిథి గృహంలోఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రా ఊటీ అయిన అరకు లోయను లూటీ చేసేందుకే కిడారి సర్వేశ్వరరావు చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. కిడారి తన పదవికి రాజీనామా చేయాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే కిడారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. అరకులోయ ప్రజలు గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపిస్తారన్నారు.