మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సిఎం కిరణ్ మాటలు హాస్యాస్పదం : భూమా
09 Aug 2013 2:31 PM
కర్నూలు, 9 ఆగస్టు 2013:
రాష్ట్ర విభజన విషయంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఒక సామాన్య పౌరుడిలా మాట్లాడడం హాస్యాస్పదం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని ఆ పార్టీ నేతలు సమైక్యవాదులమని చెప్పడంలో ఔచిత్యం లేదని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై హోంశాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి ఆంటోని కమిటీకి చెప్పేది లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు.