మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
'సీఎం సొంత జిల్లాలోనే పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు'
22 Aug 2015 5:15 PM
సంగారెడ్డి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత జిల్లాలోనే రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి విమర్శించారు.
శుక్రవారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం ఏర్పడి, పెట్టిన పెట్టుబడులు రాక, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు ధైర్యం ఇస్తే ఆత్మహత్యలు కొంతవరకు నివారించడం సాధ్యమవుతుందన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందంచడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మూడెకరాల పొలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.