ప్రభుత్వమే కక్షిదారు

అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు ఎలా వచ్చారు
రోజా తరపు న్యాయవాది ఇందిరాజైసింగ్ వాదన
తీర్పు రేపటికి వాయిదా

హైదరాబాద్ః   వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ....  న్యాయవాది ఇందిరాజైసింగ్ ఇవాళ హై కోర్టులో తన  వాదనలు వినిపించారు.  ప్రభుత్వమే కక్షిదారుగా ఉంటే, ఇక్కడ  అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్కు వచ్చారని ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.  శాసనసభ చేసిన అప్పీల్ మాత్రమే ఇక్కడ వర్తిస్తుందని, అసెంబ్లీ అప్పీల్కు రాలేదు కాబట్టి, మధ్యంతర ఉత్తర్వులు అమలుకు అభ్యంతరం లేదనే అర్థం చేసుకోవాలన్నారు. 

అసెంబ్లీ ఉద్యోగులు ఒక పక్షం వహించకూడదన్న విషయాన్నిఇందిరాజైసింగ్  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ ...ఉద్యోగులకు సమానమేనన్న విషయాన్ని పూసగుచ్చారు. అలాంటప్పుడు అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు ఎలా వస్తారని వాదించారు.  
 
ఒకవేళ194 కిందే చర్య తీసుకున్నారనుకుంటే ముందుగా నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఇందిరా జైసింగ్ ప్రశ్నించారు. 340 కిందే ఎమ్మెల్యే రోజాపై చర్య తీసుకున్నారని స్పష్టమవుతుందన్నారు. సభ పొరపాటు చేసిందని, ప్రభుత్వం వచ్చి కోర్టుకు చెబుతోందని, ఆ పొరపాటును సభే సరిదిద్దుకోవాలని రోజా తరఫు న్యాయవాది తన వాదనలు గట్టిగా వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.

Back to Top