కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
26 Mar 2016 9:29 AM
హైదరాబాద్) వైఎస్సార్సీపీ తెలంగాణ శ్రేణులకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, పార్టీ ని ముందుకు నడిపించాల్సిన అంశాల మీద సూచనలు చేశారు. ఖమ్మంలో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేషన్ ఎన్నికల కో-ఆర్డినేటర్ లింగాల కమల్రాజ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్లలో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ ‘‘ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు.. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీల నాయకులు నన్ను సంప్రదించారు. మీ పార్టీకి (వైఎస్సార్ సీపీకి) పదికి పైగా సీట్లు వస్తాయని; మద్దతునిస్తే మేయర్, ఉప మేయర్ పదవులను పంచుకుందామని అన్నారు’’ అని చె ప్పారు. ప్రతి ఓటమి వెనుక ఒక గెలుపు ఉంటుం దన్న విషయాన్ని పోటీ చేసిన అభ్యర్థులు గమనంలో ఉంచుకుని.. ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని, సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
అసాధ్యమైన హామీలతో ప్రజలను మభ్య పెట్టారని, టీఆర్ఎస్కు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామన్నట్టుగా భయభ్రాంతులను చేశారని విమర్శించారు.అందుచేత ఎన్నికల హామీలను అమలు చేసే దాకా పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని విన్నవించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు.
సమావేశంలో 4, 32 డివిజన్ల కార్పొరేటర్లు సలువాది వెంకయ్య, దోరేపల్లి శ్వేత; పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా దయానంద్, కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, సంయుక్త కార్యదర్శులు షర్మిలాసంపత్, సూతగాని జైపాల్; జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, గుండా వెంకటరెడ్డి; పాలేరు, వైరా నియోజకవర్గాల ఇన్చార్జిలు సాధు రమేష్రెడ్డి, బొర్రా రాజశేఖర్; జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు బీమా శ్రీధర్, కొంగర జ్యోతిర్మయి, వంటికొమ్ము శ్రీనివాస్రెడ్డి; యువజన, మహిళ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి.ముస్తఫా, కీసర పద్మజారెడ్డి, గుమ్మా రోశయ్య తదితరులు పాల్గొన్నారు.