ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
పచ్చచొక్కాల ముసుగులో అశోక్ బాబు, సాగర్ లు
12 Jun 2017 11:00 AM
తిరుపతి రూరల్ : చట్టాన్ని, ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీకి ఊడిగం చేస్తూ సామాన్యులను, వైయస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్న కొందరు అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని వైయస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు తప్పనిసరిగా దోషులుగా నిలబడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉద్యోగులపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించి పచ్చచొక్కా ముసుగులో అశోక్బాబు, సాగర్ చిలకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తన మాటలను తప్పుపడుతున్న వారు తప్పుచేసిన వారిని వదిలివేయాలని కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. తనను విమర్శించే ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులు బాధపెడితే మాకు చెప్పండి అంటూ.. ప్రత్యేకంగా గ్రీవెన్స్డేను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి డిమాండ్ చేశారు.