వైయస్‌ జగన్‌ హామీపై చేనేతలు హర్షం


తూర్పు గోదావరి: చేనేత కార్మికులకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై వారు హర్షం వ్యక్తం చే స్తున్నారు. 200వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ విలసవిల్లి గ్రామంలో చేనేత కార్మికురాలిని కలిశారు. ఈ సందర్భంగా చేనేత వృత్తిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ జగన్‌ స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడంపై చేనేత కార్మికురాలు వెంకటలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. చేనేతలకు నెలకు రూ.2 వేలు, పింఛన్‌ సౌకర్యం కల్పిస్తామని వైయస్‌ జగన్‌ హామీ చ్చినట్లు వెంకటలక్ష్మీ తెలిపారు. వైయస్‌ జగన్‌ స్వయంగా మా ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మా పిల్లల చదువులకు సహాయం చేస్తామన్నారని చెప్పారు. ఇల్లు కూడా కట్టిస్తామని మాట ఇచ్చినట్లు వెంకటలక్ష్మీ తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top