వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చేనేత కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరిక
04 Dec 2017 12:43 PM
అనంతపురం: ధర్మవరం నియోజకవర్గంలోని పలు చేనేత కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వైయస్ఆర్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో వినోద్ ఆధ్వర్యంలో భారీగా చేనేత కార్మికులు, యువకులు వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి కేతిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో చేనేతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన ముడిపట్టు ధరలతో చేనేత రంగం పీకల్లోతు సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. గత వైభవం మళ్లీ రావాలన్నా..చేనేత ముడిపట్టు రాయితీ పథకం సక్రమంగా అమలు కావాలన్నా వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. పార్టీలో చేరిన వారిలో బాబావలి, లోకేష్, మంజు, శివయ్య, కేశవ, పీరా, షేక్షావలి, నాగార్జున, ధన, నూరు, మధు, బాలు, గోపాల్, అశోక్ తదితరులు ఉన్నారు.