చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ప్రత్యేకహోదాపై బాబూ రెండు నాలుకల ధోరణి
22 May 2016 9:15 PM
విజయనగరం: ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభ్రదస్వామి ఆరోపించారు. ఆదివారం విజయనగరంలో కోలగట్ల వీరభ్రదస్వామి మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని అంటారు. తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రత్యేక హోదా కావాలంటూ రెండు నాలుకల ధోరణిలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలను మోసం చేస్తూ బాబు కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. హోదాపై ఇప్పటికైనా ఒక స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని చంద్రబాబును కోలగట్ల ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే బాబు మాత్రం విదేశీ పర్యటనలూ చేయడం ఎంతవరకు సమాంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.