రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాబు అవినీతిని అంతం చేస్తారు
04 Jul 2016 11:03 AM
వైయస్సార్ జిల్లా(పులివెందుల): చంద్రబాబు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో గుళ్లు, గోపురాలు కూల్చివేయడం భక్తుల మనోభావాలను కించపర్చడమేనని దుయ్యబట్టారు. అవినాష్ ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా భక్తుల తోపులాట జరిగి 20 మందికి పైగానే చనిపోయారని ఆయన అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైయస్ఆర్ సీపీ ఇచ్చిన పిటిషన్ను స్పీకర్ తిరస్కరించడం వారి నిరంకుశత్వానికి పరాకాష్టగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్-1 స్థానాన్ని ఆక్రమించిందంటే ఈ ఘనత చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్ లకే దక్కుతుందన్నారు. చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతున్నా.. అధికార పార్టీ మంత్రులు మాత్రం ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు అంతం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించారు.