మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం పనికిరాని మాటలు
30 Mar 2017 4:34 PM
విజయవాడ: ప్రతిపక్షం పట్టుబట్టి లీకేజీల అంశాన్ని చర్చకు తీసుకొస్తే ప్రభుత్వం దానిపై సమాధానాలు చెప్పకుండా పనికిరాని అంశాన్ని మాట్లాడుతోందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ధ్వజమెత్తారు. మాట్లాడిందే మాట్లాడి సీఎం సభా సమాయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలపై చర్చించాల్సిందిపోయి నువ్వేం చదువుకున్నావని బాబు ప్రతిపక్షనేత వైయస్ జగన్ను అడగడం బాధాకరమన్నారు. రాజకీయాల్లోకి రావడానికి పలనా చదువు చదవాలని చట్టం ఏమైనా ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. మీ మిత్రపక్ష బీజేపీలో కేంద్రమంత్రులే 8వ తరగతి చదివిన వారు ఉన్నారని చెప్పారు. విద్యార్థుల జీవితాలను కుదిపేసే పేపర్ లీకేజీల అంశంలో మంత్రి నారాయణను ముఖ్యమంత్రి వెనకేసుకురావడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేసి నిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు.