మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అధికారమిచ్చింది దోచుకుతినేందుకేనా బాబూ..?
13 Jun 2017 2:32 PM
- భూదందాలనే ధ్యేయంగా పెట్టుకున్న టీడీపీ సర్కార్
- చంద్రబాబు, లోకేష్ల ఆధ్వర్యంలో పెరుగుతున్న ఆక్రమణలు
- సిట్తో విచారణ సమగ్రంగా జరగదు
- బాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ వేయాలి
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్: అనుభవం ఉందని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారా..? ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టుకొని తినేస్తారా...? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ భూదందాలనే ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అధికారం ఉంటే.. భుజబలం ఉంటే ఎదుటివాడు పేదవాడు అయితే అది ప్రభుత్వ భూమి అయినా కబ్జా చేసుకోవడమే అనే లక్ష్యంతో చంద్రబాబు పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ భూముల కుంభకోణాలు చంద్రబాబు ఆధ్వర్యంలో లోకేష్ నాయకత్వంలో జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ల్యాండ్ మాఫఙయా ఏరకంగా పెచ్చుమీరుతుందో.. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలన్నారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను లూటీ చేయడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భూకబ్జాలపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు.
కంటితుడుపు చర్యగా సీఎం మీటింగ్
గత ఆరు నెలలుగా ప్రతిపక్ష వైయస్ఆర్ సీపీ భూ కుంభకోణాలపై గోషిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కంటితుడుపు చర్యగా మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించి, భూకబ్జాలపై సిట్ ఏర్పాటు చేశాం అని ప్రకటించారన్నారు. రెవెన్యూమంత్రి ప్రెస్ ముందుకు వచ్చి కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో 300 ఎకరాల రికార్డులు తారుమారయ్యాయి. వాటి మీద విచారణ చేస్తాం.. ఇంకేదైనా ఉంటే అది కూడా చేస్తాం అన్నట్లుగా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడారని బొత్స ఆరోపించారు. హుద్ హుద్ తుఫాన్లో రికార్డులు మాయమయ్యాయన్న జిల్లాకు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సిట్లో ఉన్నారు కాబట్టి భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగదని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ చుట్టుపక్కల మండలాలు మధురవాడ, అనకాపల్లి, పద్మనాభం, అనందపురం, భిమిలీ, అనకాలపల్లి రూరల్ల్లో వేలాది ఎకరాలు ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చంద్రబాబును ప్రశ్నించారు. 233 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో ట్యాంపరింగ్ జరిగిందని, 2 లక్షల 95 వేల ఎఫ్ఎంబీ కాపీలు కనిపించకుండా పోయాయయని జిల్లా కలెక్టర్ చెప్పిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు.
విశాఖ ప్రతిష్టను దిగజార్చుతున్న చంద్రబాబు సర్కార్
విశాఖకు పేరు ప్రతిష్టలను టీడీపీ నేతలు దిగజార్చుతున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. పాట్నర్షిప్ సమ్మిట్లు పెట్టి మాటలు చెప్పడం కాదు. భూ కుంబకోణాలను అరికట్టాలని, ఇలాంటి పరిస్థితులు చూసి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. సాక్షాత్తు విశాఖ జిల్లాకు చెందిన భూ దోపిడీ చేసిన వారెవరైనా చొక్కా పట్టుకొని తరిమికొట్టాలని మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటప్పుడు మీరు సీబీఐ విచారణ వేయడానికి ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబును నిలదీశారు. భూకబ్జాల్లో మీ లుసుగు ఏంటని ప్రశ్నించారు. భూ ఆక్రమణలు రెండు గ్రామాలే అంటున్నారు కానీ పద్మనాభం మండలంలోని గ్రామాల్లో ఇనాం భూములు, దేవాలయ భూములు, సంవత్సరన్నర క్రితం స్థానిక టీడీపీ మంత్రి, ఎమ్మెల్యే, హైదరాబాద్లోని రియల్ వ్యాపారులతో కలిసి ఏరకంగా కబ్జా చేయడానికి ప్రయత్నించారో దానిపై విచారణ లేదా...? అని విరుచుకుపడ్డారు. ఆనందపురం మండలంలో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అమాయక రైతుల నుంచి అసైన్డ్ భూములు లోకేష్ నాయకత్వంలో లాక్కొని నాలుగు జీవోలు విడుదల చేసి వెంటనే విత్డ్రా చేసుకుని, ఇంకా ఆ రైతుల నుంచి తీసుకున్న రికార్డులను ఇప్పటికీ ఇవ్వలేదే.. మరి దానిపై విచారణ జరిపించరా.. అని ప్రశ్నించారు. విశాఖ భూకబ్జాలపై చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.