పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
చంద్రబాబు నీకు ఇది తగునా
09 Jun 2017 6:13 PM
తొండూరు : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కానుకల పేరుతో మతాలను వేరుచేయడం నీకు తగునా బాబు అని వైయస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. తొండూరులో విలేకరుల సమావేశంలో వైయస్ఆర్సీసీ మండల రైతుసంఘం నాయకులు పల్లెటి ఈశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి బండి రమణారెడ్డిలు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రంజాన్ తోఫాని ముస్లిం సోదరులకు కానుకగా ఇస్తున్నావ్.. క్రిస్మస్ అని క్రైస్తవులకు కానుకలను ఇస్తున్నావు. అదే సంక్రాంతి పండుగ వస్తే అందరికి కానుకలు ఇస్తున్నావు.. అయితే రంజాన్, క్రిష్మస్లకు కూడా సంక్రాంతి పండుగ మాదిరే కానుకలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిష్మస్, రంజాన్లకు తోఫాలు వేరువేరుగా పంపిణీ చేయడం వల్ల ఇవి కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధానం కాదా అని వారు ప్రశ్నించారు. అందువల్ల కులమతాల విభేదాలు లేకుండా అందరికి ఒకే మాదిరిగానే సంక్రాంతి, రంజాన్, క్రిష్మస్లకు కానులకు ఇవ్వాలన్నారు.