డబ్బులు, ప్రలోభాలే బాబు నమూనా

తూర్పుగోదావరిః డబ్బులు, ప్రలోభాలతో టీడీపీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులంతా ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ మొహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టీడీపీ ఎన్ని బెదిరింపులకు దిగినా భయపడకుండా ఓటర్లు ధైర్యంగా 10మంది వైయస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు.  4, 9, 15, 21, 22, 23, 24, 32, 30, 47 వార్డులలో వైయస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. అవినీతి సొమ్ముతో అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనా బాబు నీ నమూనా అని ప్రతిపక్షాలు  మండిపడుతున్నాయి.

Back to Top