ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
ప్రజాధనంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం..!
19 Oct 2015 6:52 PM
చిత్తూరు(పుంగనూరు) : రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు. శంకుస్థాపన కోసం ఖర్చు చేస్తున్న రూ.400 కోట్లను ఎక్కడి నుంచి తెచ్చారని చంద్రబాబును నారాయణస్వామి ప్రశ్నించారు. అది ప్రజాధనం కాదా అని నిలదీశారు. పుంగనూరులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని నారాయణస్వామి చెప్పారు. ప్రత్యేకహోదా వచ్చేదాకా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. .