బాబుకు అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదు

ప్రకాశంః వైఎస్సార్సీపీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో దాదాపు 47 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్య్వూలు నిర్వహించారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున  నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల స్పందన చూస్తే జిల్లా ఎంత వెనకబడిందో అర్ధమౌతోందన్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.  చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగుల పట్ల లేదని విమర్శించారు. 
 
Back to Top