పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
అవినీతి కోసమే అంచనాల పెంపు
20 Sep 2017 4:02 PM
- పోలవరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
- బాబు ధనదాహం కోసం అంచనాలు పెంచారు
- ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు
- ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప పనులు శూన్యం
- పోలవరం ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్ః పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన ధన దాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారని ధ్వజమెత్తారు. ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి మూడేళ్లుగా బాబు ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బాబు నీ తాలూకా ఆర్థిక అవసరాల కోసం, అవినీతి కార్యక్రమాల కోసం జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఆలస్యం చేయడం ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టడం కాదా అని నిలదీశారు. అలసత్వం జరుగుతుందన్న సాకుతో ఆలస్యం అనే కోణాన్నిసృష్టించి...పోలవరం రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి బాబు హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. పోలవరం దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడారు.
ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పినా వినకుండా బాబు కంపెనీ ప్రతినిధులను వెనకేసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఆ కంపెనీ వల్లే పోలవరం ఆలస్యం అయిందని బాబు సాకులు వెతకడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో మీకు నోట్ల సంచులు మోసిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చింది వాస్తవం కాదా..? అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కాంట్రాక్టర్ తప్పు చేశాడని మూడేళ్ల తర్వాత చెబుతావా..? కేంద్ర సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు, అధికారులు అడుగుతున్నప్పుడు ఆ కంపెనీని ఎందుకు వెనకేసుకొచ్చారో సమాధానం చెప్పాలన్నారు. వైయస్ఆర్ హయాంలో రూ. 16వేల కోట్ల అంచనాతో పోలవరానికి శంకుస్థాపన చేసి రూ. 4వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఆ 4వేల కోట్లలో మట్టి పనులు జరిగాయి. 80శాతం కాలువలు కూడ పూర్తయ్యాయి. భూసేకరణ కోసం పరిహారం కూడ ఇస్తే చంద్రబాబు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం అంచనాలను రూ. 16వేల కోట్ల నుంచి 48వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. పోలవరం అంచనాలు రూ.300కోట్లు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలన్నారు. ప్రజాధనాన్ని వ్యయంగా పెంచి దోచుకుంటుంది వాస్తవం కాదా అని నిలదీశారు. రైతును ఆదుకునే, ప్రజల దాహార్తిని తీర్చే పోలవరం ప్రాజెక్ట్ ను మీ స్వార్థం కోసం ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసమని బాబును ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో పోలవరంపై మీరు చేసిన ఖర్చు ఎంత..? శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. చంద్రబాబువి ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప పనులు శూన్యమని బొత్స విమర్శించారు.