వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
మోసం చేయడమే చంద్రబాబు నైజం
10 May 2016 1:46 PM
కాకినాడః ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్లో అందరి జీవితాలు బాగుపడతాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమబాట పట్టారని ఆయన అన్నారు.
ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్న, యువత జీవితాలు బాగుపడాలన్న ప్రత్యేక హోదా అవసరం అని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని, ఎన్నికలయ్యాక చంద్రబాబు పంగనామాలు పెట్టారని ఆయన విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల సందర్భంలో చెప్పిన చంద్రబాబు తనకు ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చాక అన్నీ మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువతను నిరుద్యోగులుగా మిగిల్చారని, నిరుద్యోగ భృతి విషయంలో మోసం చేశారని ఫైరయ్యారు. చంద్రబాబు అన్ని కులాల వారిని వంచించారని, కులాలు, మతాల పేరిట విభజన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.