నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరువు
17 Nov 2015 12:24 PM
అనంతపురం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రభుత్వ అసమర్థ పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పక్కా గృహాలు నిర్మించని కారణంగా..భారీ వర్షాలతో ఇళ్లు లేని నిరుపేదలంతా చనిపోతున్నారని చాంద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఇళ్లులేని పేదలు మృత్యువాత పడుతున్నారని వాపోయారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తన హయాంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని..అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో చాంద్ బాషా గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.