మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్కు ఆహ్వానం
10 Jul 2018 9:52 AM
తూర్పుగోదావరి : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మెహన్రెడ్డిని చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కరప గ్రామానికి చెందిన శారదాపీఠం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ చాగంటి సూరిబాబు ఆహ్వానించారు. సోమేశ్వరం లోని క్యాంపు ఆఫీసులో ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర సరస్వతి మహాస్వామి ఈ నెల 27న హృషీకేషిలో నిర్వహించే చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కోరినట్టు తెలిపారు. స్వామీజీ సూచనల మేరకు శారదా పీఠం ధర్మాధికారితో కలిసి పార్టీ అధినేతను కలిసినట్టు చెప్పారు. గతేడాది హృషికేషిలో స్వామీజీ నిర్వహించిన చాతుర్మాస దీక్ష పూజలలో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా జననేత గుర్తు చేశారని ఆయన చెప్పారు. ఆషాఢ మాసం పౌర్ణమి నుంచి భాద్రప్రద మాసం పౌర్ణమి వరకు స్వామీజీ చాతుర్మాస దీక్షలో ఉంటారని తెలిపారు. శారదా పీఠం సభ్యులు గొర్రెల శ్రీనివాస్, చాగంటి బాబీ తదితరులు జగనేతను కలిసిన వారిలో ఉన్నారు.