వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజల పక్షాన మాట్లాడితే కేసులా....?
02 Mar 2017 5:26 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజల పక్షాన మాట్లాడినందుకు కేసులు నమోదు చేయడం దారుణమని పార్టీ తనకల్లు మండల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తహశీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వాన్ని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను నిలదీసినందుకు వైయస్ జగన్పై కేసులను పెట్టడం నీతిమాలిని చర్యగా పేర్కొన్నారు. వెంటనే తమ నేతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్ధార్ నాగేంద్రకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా కన్వీనర్ విజయలక్ష్మీ, ఎంపీటీసీ రెడ్డెప్పరెడ్డి, నాయకులు కొండకమర్ల మెహతాబ్, తబ్రేజ్, నాగభూషణరెడ్డి, రామ్దేశాయ్,వాసుదేవారెడ్డి, రాధాకృష్ణ, చాంద్బాషా, మలిరెడ్డి,నరసింహులు, చిందానందరెడ్డి, జంగమరెడ్డి, సునీల్, లక్ష్మీరెడ్డి, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.