వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతు దీక్షకు తరలిరండి
28 Apr 2017 9:53 PM
దాచేపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్రెడ్డి రైతుల కోసం మే 1, 2 తేదీల్లో గుంటూరులో చేపట్టిన రైతు దీక్షకు పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలిరావాలని ఆ పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, పట్టణ కన్వీనర్ మునగా పున్నారావులు కోరారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం రైతులను పూర్తిస్థాయిలో విస్మరించిందని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటం వలనే వైయస్ జగన్ ఈ దీక్షను చేపట్టారని వారు చెప్పారు. దీక్షకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.