రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సంక్షేమ రాజ్యం రావాలంటే.. వైయస్ జగన్ సీఎం కావాలి
20 Sep 2018 3:29 PM
విజయనగరం: సంక్షేమ రాజ్యం రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి.. కావాల్సిందేని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకోవడం చారిత్రాత్మకమన్నారు. గురువారం విజయనగరంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు, పెనుమత్స సాంబ శివరాజు, కోలగట్ల వీర భద్రస్వామి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి వారికి ఓ భరోసాని ఇవ్వడానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. జననేత పాదయాత్ర 11 జిల్లాలు పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాకు ఈ నెల 24వ తేదీ జిల్లాకు చేరుకోనుందన్నారు. వైయస్ జగన్కు కుర్చి మీద తపన అంటూ ఆరోపణలు చేస్తున్నారని, నిజం జగన్కి కుర్చి కావాలి. పదవి ద్వారానే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయగలరన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం దోచుకుందాం.. దాచుకుందాం అనే రీతిలో పరిపాలన కొనసాగుతుందని ఆరోపించారు. బొబ్బిలి రాజా వారూ జిల్లా అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామన్నారు. ఈ 4 సంవత్సరాలలో ఈ అభివృద్ది చేశామని ధైర్యంగా చెప్పండని సవాలు విసిరారు. ఆస్తులు కాపాడుకోవడానికి, దందాలు చేసుకోడానికి సుజయ్ పార్టీ మారారన్నారు.
అశోక్ గజపతిరాజు ఈ జిల్లాకు చేసింది శూన్యమన్నారు.. కేంద్ర మంత్రిగా ఉండి హోదా కోసం ఎప్పుడైనా మాట్లాడారా? కాంగ్రెస్ మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసి.. నేడు అదే కాంగ్రెస్తో ఎలా జతకడతారు? రోశయ్య మీటింగ్లో రాష్ట్ర విభజనకి అనుకూలమని చెప్పింది మీరు కాదా అని నిలదీశారు. భోగా పురం ఏయిర్పోర్టు టెండర్లు రద్దు చేసి ప్రయివేట్ వారికి ముడుపులు తీసుకుని అప్పజెప్పాలను కోవడం వాస్తవం కాదని.. మీ ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
మీరేం తెచ్చారో చెప్పండి?
మేం జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ, ఆంధ్రా యునివర్సిటీ, కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశాం.. మీరేం తెచ్చారో చెప్పండి? అని బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. విజయనగరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి రామతీర్థ సాగర్ని మా హయాంలో మొదలు పెట్టామన్నా. టీడీపీ నేతలు నేటికి పూర్తి చేయలేకపోయారు. ఇంటికో రేటు పెన్షన్కో రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు తాతగారి ఆస్తుల్లా రూ.1300 కోట్లు అప్పనంగా చెల్లించారని కాగ్ బయటపెట్టిందని వివరించారు. సీఎంకి ప్రయివేట్ సంస్థలకు వాటాలు నప్పకే అగ్రి గోల్డ్ ఆస్తుల వేలం తేలట్లేదు అన్నారు. తోటపల్లి వద్ద పడుకుని పూర్తి చేశానని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను జిల్లాలో విజయవంతం చేద్దామని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందామని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.