పిరికిపందల్లా స్టేలు తెచ్చుకోవడం మా రక్తంలోనే లేదు

  • భూ స్కాంలో నా పేరు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి చెబుతా..
  • చంద్రబాబుకు బహిరంగ చాలెంజ్‌ విసిరిన బొత్స
  • భూదందాలపై 22న విశాఖలో మహాధర్నా
  • పాల్గొననున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  • భూఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌
హైదరాబాద్‌: విశాఖ భూ కుంభకోణంలో బొత్స బ్రదర్స్‌ పేరు ఉంటే తలదించుకొని రాజకీయాలకు స్వస్తి చెబుతానని, పిరికిపందల్లా స్టేలు తెచ్చుకోవడం మా రక్తంలోనే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. దమ్ముంటే భూ కుంభకోణాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా..తప్పుడు ఆరోపణలు చేసి టీడీపీ భూదందాలపై మాట్లాడకుండా నోరు నొక్కుదామనే కుట్రలు పన్నుతున్నారని, కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదన్నారు. విశాఖ భూ కుంభకోణాలపై ఈనెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ మహాధర్నాను నిర్వహిస్తుందన్నారు. ఈ మహాధర్నాలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారన్నారు. అఖిలపక్ష నేతలు హాజరై ధర్నాను విజయవంతం చేయాలని బొత్స కోరారు. ఇప్పటికే ప్రభుత్వ మిత్రపక్షమైన బీజేపీ కూడా భూదందాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేస్తుందన్నారు. 

సర్కార్‌ ‘సిట్‌’ అంటే కూర్చోవడమే..
233 గ్రామాల్లో ఉన్న లక్ష ఎకరాలకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు కనిపించడం లేదు. 400 రిజిస్టర్‌లు కనిపించడం లేదు. 3 లక్షల అడంగల్‌ కాపీలు కనిపించడం లేదని అధికారులే చెబుతున్నారన్నారు. మళ్లీ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా అధికారులను సిట్‌లో ఇన్వాల్వ్‌ చేస్తే ప్రయోజనం ఏముంటుందన్నారు.  సీబీఐ విచారణ వేస్తేనే న్యాయం జరుగుతుంది తప్ప సిట్‌ వల్ల ఉపయోగం లేదన్నారు. అధికార పార్టీ పెద్దలు సిట్‌ అంటే అక్కడ కూర్చోవడమే తప్ప న్యాయం జరగదన్నారు. రెండు గ్రామాల్లో 270 ఎకరాలే కాదు.. ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, అనకాపల్లి రూరల్‌తో పాటు విశాఖ సెక్యూరిటీ హౌస్‌ పక్కన గజం రూ. లక్ష విలువ చేసే దస్‌పల్లా భూములను కూడ అన్యాయక్రాంతంగా దోచుకున్నారని విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పొలంలో ఎ్రరచందనం దుంగలు దొరికినప్పుడు సిట్‌ విచారణ వేస్తే ఏం జరిగిందో ప్రజానీకానికి తెలియదా అని ప్రశ్నించారు. కాబట్టి ఇటువంటి కంటితుడుపు చర్యలతో ప్రజల కన్నుగప్పే ప్రయత్నం చేయోద్దని ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. 

కలెక్టర్‌కు ప్రభుత్వ ఆస్తులు కాపాడే బాధ్యత లేదా..?
భూస్కాంల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ హస్తం లేకపోతే సీబీఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు జంకుతున్నారని బొత్స ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏ రకంగా సీబీఐ ఎంక్వైరీ వేసి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పారో.. ఆ రకంగా చంద్రబాబు కూడా చేయాలన్నారు. దస్‌పల్లా భూములు ఎక్స్‌పార్టీ అయిపోయిందని జిల్లా కలెక్టర్‌ చెప్పడం పెద్ద జోక్‌గా ఉందన్నారు. కలెక్టర్‌కు ప్రభుత్వ ఆస్తులు కాపాడే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బు సంచులు మోసినవారికి చంద్రబాబు కనుసన్నల్లో దస్‌పల్లా భూములు దోచిపెట్టారని విమర్శించారు. భూదందాలపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామని బొత్స స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top