మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్సీపీలోకి బీజేపీ నేత
02 Jul 2016 11:44 AM
- వైయస్సార్సీపీలో చేరిన బోరెడ్డి లక్ష్మీరెడ్డి
- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన వైయస్ జగన్
- జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామకం
కర్నూలుః బాబు అవినీతి సొమ్ముకు ఆశపడి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా కేడర్ మొత్తం వైయస్సార్సీపీ వెన్నంటే ఉంది. పార్టీకి జిల్లాలో ప్రజాబలం మెండుగా ఉంది. ఆళ్లగడ్డ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని న్యాయవాది బోరెడ్డి లక్ష్మీరెడ్డి అన్నారు. బీజేపీ నియోజవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన బోరెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడైన ఆయన హైదరబాద్లోని లోటస్పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. లక్ష్మీరెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
వీరందరికీ వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నగర పంచాయతీ వైస్చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, దొర్నిపాడు మండలం నాయకుడు శ్రీపతిప్రసాద్ ఉన్నారు.
జిల్లా ఉపాధ్యక్షుడిగా బోరెడ్డి
పార్టీలో చేరిన బోరెడ్డి లక్ష్మీరెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. పార్టీలో చేరిన వెంటనే తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.