ఐటీ రిట‌ర్న్స్ స‌మ‌ర్పించ‌ని భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిట‌ర్స్స్ స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌పై వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత‌లు  ఫిర్యాదు చేసింది. భూమా బ్రహ్మానందరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయపన్ను (ఐటీ) రిటర్న్స్‌ సమర్పించలేదని  సోమవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి పార్టీ నేత‌లు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతుంద‌ని, యధేచ్ఛగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంద‌ని ఎన్నిక‌ల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిక‌ల కోడ్‌ ఉల్లంఘిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు  బూత్‌ కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Back to Top