ఇంటికో ఉద్యోగం పీకేస్తున్నారు

కర్నూలు : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చంద్రబాబుపై మండిపడ్డారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని ఫైరయ్యారు. కర్నూలులో భూమా అఖిలప్రియ విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు పాలనతీరుపై నిప్పులు చెరిగారు.  కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చేందుకే చంద్రబాబు వడ్డీ వ్యాపారులపై దాడులు చేయిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఇంటికో ఉద్యోగం పీకేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

Back to Top