బాబు భజన దీక్ష అని మార్చుకోండి..!

తిరుపతి: నవనిర్మాణ దీక్ష పేరుతో
జరుగుతున్నదంతా చంద్రబాబు భజన మాత్రమే అని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా
అభివర్ణించారు.  ప్రభుత్వం చేపట్టిన
కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమని ఆమె విమర్శించారు. 'నా
నియోజకవర్గంలో జరుగుతోన్న నవనిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైన నాకే ఆహ్వానం పంపలేదు' అని ఆమె ఆవేదన
వ్యక్తం చేశారు. సోమవారం
తిరుపతి వచ్చిన రోజా విలేకరులతో మాట్లాడారు.


గతంలో చంద్రబాబు ఒక్క హైదరాబాద్ పైనే దృష్టి
కేంద్రీకరించిన విధంగా ఇప్పుడు అమరావతి పేరును జపిస్తున్నారని, అలా
చెయ్యడం సరికాదని, అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యమని రోజా అన్నారు.
గడిచిన రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని విమర్శించారు. ప్రత్యేక
హోదా సాధన, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం అన్నిపార్టీలను కలుపుకొని కేంద్రంపై
ఒత్తిడి పెంచే విధంగా టీడీపీ ప్రయత్నించాలని కోరారు.  

Back to Top