కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బత్తాయి రైతులకు షర్మిల భరోసా
14 Feb 2013 5:20 PM
నల్గొండ:
కొద్దికాలం ఓపికపడితే మీ కష్టాలు తొలగిపోతాయని శ్రీమతి వైయస్ షర్మిల ఇచ్చిన హామీ తమకు సంతోషాన్ని కలిగించిందని బత్తాయి రైతులు చెప్పారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆమె బత్తాయి రైతులను కలిశారు. తోటలను పరిశీలించి వారిని ఓదార్చారు. ఇందుకోసం ఆమె చేల గట్ల మీద నడిచివెళ్ళారు. ఎండిన బత్తాయి చెట్లతో రైతులు ఆమెకు ఎదురొచ్చారు. పక్కనే ఉన్న బత్తాయి తోటలకు ఆమెను తీసుకెళ్ళారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ జీవించి ఉంటే ఈ ప్రాంతానికి నీరు వచ్చేదనీ, తమకీ ఇబ్బంది ఉండేది కాదనీ రైతులు తెలిపారు. నీరు లేక తమ తోటలను కొట్టేసినట్లు చెప్పారు. కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయనీ, కట్టలేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటున్నాయనీ వివరించారు. తొలగించిన కరెంటును పునరుద్ధరించుకోవడానికి నాలుగు రోజులు పట్టిందనీ, ఈలోగా తోట ఎండిపోయిందనీ వారు ఆవేదన వ్యక్తంచేశారు.